హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ: బ్రాహ్మణి స్టీల్స్ పై గందరగోళం

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్ కు మైనింగ్ కేటాయింపుపై బుధవారం శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, తెలుగుదేశం సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ అట్టుడికింది. మంత్రి కన్నా లక్ష్మినారాయణ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడిపై చేసిన ఆరోపణతో తెలుగుదేశం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో సభను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

బ్రాహ్మణి స్టీల్స్ కు కాప్టివ్ మైనింగ్ కేటాయింపుపై చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెసు మైనింగ్ మాఫియాను ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు సిగ్గు లేకుండా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ సిగ్గు లేకుండా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ సైంధవ పాత్రను తాను వివరించాల్సి ఉందని మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఈ సమయంలో తెలుగుదేశం, అధికార పక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X