నల్లమలలో మరణించింది శాఖమూరి

నల్లమల అడవుల్లో 2007లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్సి మాధవ్ ఎన్ కౌంటర్ తర్వాత శాఖమూరి అప్పారావుదే పెద్ద ఎన్ కౌంటర్. శాఖమూరి అప్పారావు తొలిసారి 1993లో తొలిసారి అరెస్టయ్యాడు. శాఖమూరి అప్పారావు 2000ల్లో బెయిల్ పై విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే రక్షణ దళంలో అతను పనిచేశాడు. వరంగల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన శాఖమూరి అప్పారావు వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతూ ఆర్ఎస్ యులో పనిచేశాడు. 1982లో అతను తొలిసారి అజ్ఞాతంలోకి వెళ్లాడు. తిరుపతిలోని అలిపిరిలో నారా చంద్రబాబు నాయుడుపై దాడి కేసులో, ఐపియస్ అధికారులు ఉమేష్ చంద్ర, వ్యాస్ హత్యకేసుల్లో అప్పారావు నిందితుడు.
అప్పారావు ఎన్ కౌంటర్ పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల క్రితం అప్పారావును మహారాష్ట్రలో అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అయితే, మావోయిస్టుల సమావేశం జరుగుతుందని తెలిసి తాము వెళ్లామని, అప్పుడు మావోయిస్టులు ఎదురు పడ్డారని, ఈ సమయంలో ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసులు అంటున్నారు. తన కుమారుడిని ఎన్ కౌంటర్ పేర కాల్సి చంపారని శాఖమూరి అప్పారావు తల్లి సరోజ ఆరోపిస్తోంది.
రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణ అప్పట్లో చర్చలకు వచ్చిన సమయంలో నల్లమల అడవుల్లో శాఖమూరి అప్పారావు వీడ్కోలు చెప్పాడు. రామకృష్ణ తన ఆయుధాన్ని శాఖమూరి అప్పారావుకే అప్పగించాడు. శాఖమూరి అప్పారావు భార్య రజిత 2007లో అప్పటి రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ తో పాటు ఎన్ కౌంటర్ లో మరణించింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications