వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్ ఉద్యమ నేత కానూ సన్యాల్ ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanu Sanyal
కోల్ కత్తా: నక్సలైట్ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరైన కానూ సన్యాల్ మంగళవారం మరణించారు. ఆయన పశ్చిమ బెంగాల్లోని సిలిగిరి మండలంలో గల తన స్వగ్రామం నక్సల్బరీలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన చాలా కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నట్లు సమాచారం. కానూ సన్యాల్ 1932లో జన్మించారు. ఆయనకిప్పుడు 78 ఏళ్ల వయస్సు. సాయుధ పోరాటం ద్వారా విప్లవాన్ని సాధించడానికి 1969 సిపిఐ (ఎంఎల్)ను స్థాపించిన వారిలో ఆయన ఒకరు. నక్సల్బరీ ఉద్యమ నేత చారు మజుందార్ కు ఆయన సమకాలికుడు.

కానూ సన్యాల్ 1970 ఆగస్టులో ఆరెస్టయ్యారు. ఆయన అరెస్టుకు నిరసనగా పెద్ద యెత్తున హింస చెలరేగింది. పార్వతీపురం కుట్ర కేసులో ఆయన ఏడేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జైలులో ఉన్నారు. ఆయన 1977 లో జైలు నుంచి విడుదలయ్యారు. 1985లో సన్యాల్ ఐదు నక్సల్స్ గ్రూపులతో కలిసి కమ్యూనిస్టు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు - లెనినిస్టు)ను ఏర్పాటు చేశారు. ఆయన చనిపోయే సమయానికి న్యూసిపిఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X