హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసువాళ్లే అల్లర్లు చేయిస్తున్నారు: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: హైదరాబాద్ లో అల్లర్లు చేయిస్తోంది కాంగ్రెసువారేనని ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రతిపక్ష పూర్తిగా సహకరించినా చర్చకు ప్రభుత్వం ముందుకు రాలేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మంగళవారంతో ముగిసిన శాసనసభా సమావేశాల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ అల్లర్లను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. పోలీసులు కఠినంగా వ్యవహరించి పరిస్థితి అదుపులోకి తేవాలని ఆయన సూచించారు. ప్రశాంత వాతావరణానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా అధికార కాంగ్రెసు పార్టీ ప్రయత్నించిందని ఆయన విమర్శించారు. గనుల మాఫియా కేంద్ర ప్రభుత్వానికే సవాల్ గా మారిందని, గనుల మాఫియా పార్టీలను శాసిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా అపుతున్నాయని, పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని ఆయన అన్నారు. కృష్ణా జలాలపై పంపకంపై ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. గోదావరి లాగే కృష్ణా నది కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. కాగ్ నివేదిక ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X