కెవిపి విషయం మా అంతర్గతం: సిఎం
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) లేకపోవడం వల్లనే సభ సజావుగా జరిగిందని భావించడం లేదని, తెరాస సభలో లేని లోటు కనిపించలేదని ఆయన అన్నారు. కొత్త సభ్యుల తీరు బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ అల్లర్ల వెనక కుట్ర ఉందనే ప్రకటనలు సరి కావని, ఇటువంటి ప్రకటనలు సమస్యను మరింత జఠిలం చేస్తాయని ఆయన అన్నారు. హైదరాబాద్ అల్లర్ల విషయంలో ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాయని ఆయన ప్రశంసించారు. మీ వారి సంగతేమిటంటే మా వారి ప్రకటనలు చూస్తానని ఆయన అన్నారు.
హైదరాబాద్ అల్లర్ల వెనక రోశయ్య ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉందనే విమర్శలు చేసిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీకి, శాసనసభ్యుడు శంకరరావుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఫోన్ చేశారు. అటువంటి ప్రకటనలు సరి కావని ఆయన వారికి చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్ అల్లర్లు దురదృష్టకరమని డిఎస్ అన్నారు. మత సామరస్యానికి హైదరాబాద్ ప్రతీక అని, కొన్ని మతతత్వ శక్తులు సమస్యను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.