ఇతర ప్రాంతాలకు విస్తరించిన అల్లర్లు
కాగా, పాతబస్తీలో పరిస్థితి అదుపులో ఉందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ కర్ఫ్యూ సడలించే అవకాశం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఇప్పటి వరకు 130 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో పాతబస్తీలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూస్తామని ఆయన చెప్పారు. అల్లర్లకు కారణమైనవారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అల్లర్ల వెనక ఎవరున్నారనే విషయంపై కూపీ లాగుతున్నట్లు ఆయన తెలిపారు. కర్ఫ్యూ సడలింపుపై రేపు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Tuesday, March 30, 2010, 15:08 [IST]