గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆగస్టు 14లోపు ఉప ఎన్నికలు: ఖురేషీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Qureshi
గుంటూరు: రాష్ట్రంలోని తెలంగాణలో ఖాళీ అయిన 12 శాసనసభా నియోజకవర్గాలకు ఆగస్టు 14వ తేదీ లోపు ఉప ఎన్నికలు నిర్వహిస్తామని భారత ఎన్నికల కమీషనర్ ఖురేషీ చెప్పారు. గుంటూరు జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల కార్యక్రమానికి వచ్చిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 14వ తేదీ లోపు ఎప్పుడైనా ఉప ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. అయితే, కచ్చితమైన తేదీని ఆయన చెప్పలేదు.

కాగా, జులై 17వ తేదీ తర్వాత ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఖాళీ అయిన ఆరు నెలల లోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ 10మంది తెలంగాణ రాష్ట్రసమితి (తెరాస) శాసనసభ్యులు 12 మంది, తెలుగుదేశం సభ్యుడు ఒకరు, బిజెపి సభ్యుడు ఒకరు రాజీనామా చేశారు. దీంతో ఆ 12 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X