ప్రభుత్వాలపై చంద్రబాబు ధ్వజం

నిత్యావసర సరుకులను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. కేంద్రం ధరల అదుపు విషయంలో మాయమాటలు చెబుతోందని ఆయన అన్నారు. బియ్యం, పప్పు ధాన్యాలు, కూరగాయల ధరలు పేదలకు అందుబాటులో లేకుండా పోయాయని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో నీటి సమస్య పెరుగుతోందని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
పార్టీ మహానాడును మే 28వ తేదీన హైదరాబాదులో నిర్వహించాలని తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం నిర్ణయించింది. అదే రోజు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. ఏప్రిల్ 5 నుంచి 20వ తేదీ వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. మే 1 నుంచి 8వ తేదీ వరకు గ్రామ కమిటీల ఏర్పాటవుతాయి. మే 12 నుంచి 15వ తేదీ వరకు మండల, పట్టణ కమిటీలు ఏర్పడ్తాయి. మే 18 నుంచి 20వ తేదీ వరకు జిల్లా కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలు ఏర్పాటవుతాయి.












Click it and Unblock the Notifications