హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాక్షి నుంచి సొమ్ము రాబట్టాలి: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చి చెల్లించిన సొమ్మును ప్రభుత్వం కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దిన పత్రిక నుంచి రాబట్టాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన బుధవారం ఈ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి ప్రభుత్వం వాణిజ్య ప్రకటనలను విడుదల చేయడమే కాకుండా డబ్బుల విడుదలకు కూడా అక్రమ మార్గాలు అనుసరించిందని కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ (కాగ్) తప్పు తన నివేదికలో తప్పు పట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తన కుమారుడు జగన్ కు చెందిన సాక్షి దినపత్రికకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇష్టానుసారంగా ప్రభుత్వ ప్రకటనలు విడుదల చేయించారని, పూర్తిగా అక్రమ మార్గాలు అనుసరించారని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి సాక్షి దినపత్రికను, సాక్షి టీవీ చానెల్ ను ప్రమోట్ చేసే పనికి పూనుకున్నారని ఆయన అన్నారు. సాక్షి విషయంలో కాగ్ పట్టిన తప్పులకు ప్రస్తుత ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్య మీద ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X