హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిస్థితి అదుపులో ఉంది: సబిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: హైదరాబాదులోని కర్ఫ్యూ ప్రాంతాల్లో పరిస్థితి అదుపులో ఉందని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. హైదరాబాదు అల్లర్లపై ముఖ్యమంత్రి కె. రోశయ్య ఉన్నతస్థాయి సమావేశంలో బుధవారం సమీక్షించారు. ఈ సమీక్ష తర్వాత సబితా ఇంద్రారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ రోజు పరిస్థితిని చూసిన తర్వాత కర్ఫ్యూ సడలింపుపై గురువారం నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. అల్లర్లకు పాల్పడుతున్నవారిని ఇప్పటికే గుర్తించామని, వారిలో కొంత మందిని అరెస్టు చేశామని ఆమె చెప్పారు.

కర్ప్యూ ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి రోశయ్య అధికారులను ఆదేశించారు. కర్ఫ్యూ ప్రాంతాల్లో అధికారులు పర్యటించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మునిసిపల్ కార్మీకులకు కర్ఫ్యూ పాసులు ఇవ్వాలని సూచించారు. నిత్యావసర సరుకుల పంపిణీపై కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రశాంత వాతావరణానికి సహకరించాలని ఆమె ప్రజలను కోరారు. ప్రజలు సహకరిస్తేనే అల్లర్లకు అడ్డుకట్ట వేయగలమని ఆమె అన్నారు. అల్లర్లకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X