వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయిబాబా బంగారు కనురెప్పలు చోరీ

By Santaram
|
Google Oneindia TeluguNews

Shirdi Saibaba
రంగంపేట (తూగో జిల్లా): వడిశలేరు ఏడీబీరోడ్‌ వద్దనున్న శ్రీషిర్డీసాయిబాబా ఆలయంలో సోమవారం రాత్రి దొంగ లు బంగారం, వెండి వస్తువులు, నగదు దోచుకున్నారు. బాబావారి విగ్రహానికి ఉన్న బంగారు కనురెప్పలు, చెవిదుద్దులు, చేతికిగల వెండి కడియం, పీఠానికి తాప డం చేసిన వెండిని దోచుకుపోయారు. నగదు దోచుకున్న తరువాత హుండీలను ఆలయ వెనుక భాగాన పడేశారు. ఆలయానికి పడమరవైపుగల కిటికీ ఇనుప చట్రాన్ని పెకిలించి ఆలయంలోకి ప్రవేశించారు.

ఇటీవల కాలంలో హుండీలను తెరవకపోవడంతో సుమారు రూ.10 వేల వరకూ నగదు ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. చోరీకి పాల్పడిన సొత్తు విలువ సుమారు రూ.70 వేల వరకూ ఉంటుందని గ్రామస్తులు వై.రాధాకృష్ణ, ఎం. రామకృష్ణలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు సంఘటన స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్సై ఎస్‌.ఎస్‌. బాలకృష్ణ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X