వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసు స్టేషన్ లో నిందితుడి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: వరంగల్ జిల్లా మడికొండ పోలీసు స్టేషనులో సోమ్లా నాయక్ అనే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు స్టేషనులో బాత్రూంలో యాసిడ్ తాగి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. మంగళవారం ఆత్మహత్య చేసుకున్న సోమ్లా నాయక్ ను పోలీసులు వరంగల్ లోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. అతని ఆత్మహత్య విషయాన్ని పోలీసులు బుధవారం ఉదయం వరకు కూడా గోప్యంగానే ఉంచారు.

భార్య అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు సోమ్లా నాయక్ ను మూడు రోజుల క్రితం అరెస్టు చేశారు. ఆరు రోజుల క్రితం సోమ్లా నాయక్ భార్య రజిత మరణించింది. రజిత తరఫు బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోమ్లా నాయక్ ను అరెస్టు చేశారు. పోలీసులు వేధించడం వల్లనే సోమ్లా నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X