హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: నాగం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై తమ నిబద్ధతపై తెలంగాణ న్యాయవాదులు ఆపోహలు పెట్టుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగిన సంఘటనతో తమపై తెలంగాణవాదులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేస్తూ 15 అధ్యాయాల నివేదికను రూపొందించామని, ఏప్రిల్ మొదటి వారంలో తాము నివేదికను శ్రీకృష్ణ కమిటీకి సమర్పిస్తామని ఆయన చెప్పారు.

కాగా, తెలంగాణ న్యాయవాదులపై దాడి కేసులో అరెస్టయిన తెలుగుదేశం కార్పొరేటర్లకు బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ధరల పెరుగుదలపై హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నాలో నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. ఈ సందర్భంలో తెలంగాణ న్యాయవాదులపై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి తెలంగాణ కార్పొరేటర్లు కొందరిపై కేసు నమోదైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X