హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రివర్గ కూర్పులో రోశయ్య మార్కు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: మంత్రి వర్గ ఏర్పాటులో ముఖ్యమంత్రి రోశయ్య అనూహ్యమైన నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత మంత్రులందరి చేత రాజీనామాలు చేయించి తనదైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఆయన కసరత్తు చేస్తున్నట్లు వార్తాకథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యమంత్రిగా తాను అన్ని విధాలుగా నిలదొక్కుకున్నట్లు ఆయన భావిస్తున్నారు. దీంతో తనదైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.

ఈ నెల 7వ తేదీన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) కార్యాలయం గాంధీభవన్ లో సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పుపై, తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలపై సమీక్ష జరిగే అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరుగుతుందని, ఈ సమావేశంలో మంత్రులందరి చేత రోశయ్య రాజీనామా లేఖలు తీసుకుంటారని చెబుతున్నారు. ఇప్పటికే తనదైన జట్టును ఆయన ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ జాబితాతో ఆయన ఢిల్లీకి వెళ్లి ఆమోద ముద్ర వేయించుకునే అవకాశాలున్నాయని సమాచారం. ఈ నెల 15వ తేదీ లోగా కొత్త మంత్రివర్గం కొలువు దీరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X