మంత్రివర్గ కూర్పులో రోశయ్య మార్కు?
ఈ నెల 7వ తేదీన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) కార్యాలయం గాంధీభవన్ లో సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పుపై, తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలపై సమీక్ష జరిగే అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరుగుతుందని, ఈ సమావేశంలో మంత్రులందరి చేత రోశయ్య రాజీనామా లేఖలు తీసుకుంటారని చెబుతున్నారు. ఇప్పటికే తనదైన జట్టును ఆయన ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ జాబితాతో ఆయన ఢిల్లీకి వెళ్లి ఆమోద ముద్ర వేయించుకునే అవకాశాలున్నాయని సమాచారం. ఈ నెల 15వ తేదీ లోగా కొత్త మంత్రివర్గం కొలువు దీరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Comments
Story first published: Saturday, April 3, 2010, 9:35 [IST]