వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛత్తీస్ గఢ్ మృతుల్లో 8 మంది ఎపి జవాన్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

United Andhra
జగదల్పూర్: మావోయిస్టుల దాడిలో మరణించిన సిఆర్పీఎఫ్ జవాన్లలో 8 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందినవారున్నారు. వారి మృతదేహాలను హైదరాబాదుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టుల దాడిలో మరణించిన 76 మంది జవాన్లకు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం నివాళులు అర్పించారు. సంఘటనపై అంచనాకు రావడానికి, పరిస్థితిని సమీక్షించడానికి చిదంబరం బుధవారం ఉదయం ఛత్తీస్ గఢ్ కు వచ్చారు. రాయపూర్ కు చేరుకున్న వెంటనే ఆయన ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తో, పోలీసు ఉన్నతాధికారులతో కీలకమైన చర్చలు జరిపారు.

అనంతరం గవర్నర్ శేఖర్ దత్, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ లతో కలిసి చిదంబరం జగదల్పూర్ చేరుకుని మరణించిన జవాన్లకు నివాళులు అర్పించారు. మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేస్తున్నారు. నక్సల్స్ ప్రభావం ఉన్న పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో హై అలర్ట్ ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X