రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెసులో పోటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్‌: రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల ప్రకటన వెలువడడంతో పార్టీల టికెట్ల కోసం కాంగ్రెసు పోటీ ముమ్మరమైంది. గ్రేటర్ హైదరాబాదులోని రెండు స్థానాలకు, రంగారెడ్డి జిల్లాలోని ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్‌ పరిధిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెసుకు దక్కే అవకాశాలున్నాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు ఈ సీట్లకోసం పోటీ పడుతున్నారు. అయితే ఈ రెండు స్థానాలను కాంగ్రెసు, మజ్లీస్ చెరో స్థానాన్ని పంచుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాదులోని ఒక స్థానం కోసం మాజీ మంత్రి షబ్బీర్ అలీ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి స్థానం నుండి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. పార్టీ అధిష్టానం కూడా ఆయనకు ఈ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్‌ కూడా ఈ స్థానాన్ని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. డిఎస్‌ ఉప ఎన్నికల్లో నిజామాబాద్‌ నుండి శాసనసభకు పోటీచేస్తారా, లేక రాజ్యసభకు వెళతారా అనే విషయం తేలడం లేదు. డిఎస్‌ వ్యవహారంపైనే షబ్బీర్‌ అలీకి గ్రేటర్‌ ఎమ్మెల్సీ సీటు కేటాయించే విషయం ఆధారపడివుంటుందని కాంగ్రెస్‌ వర్గాలంటున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలోని స్థానిక సంస్థలు మెజారీటి స్థానాలు తెలుగుదేశంపార్టీ ఆధీనంలో ఉన్నాయి. తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X