శ్రీకృష్ణ కమిటీని గడువు కోరుతాం: మొయిలీ

సంస్థాగత ఎన్నికల నిర్వహణకు పిసిసి ఏర్పాట్లు బాగున్నాయని ఆయన అభినందించారు. అందుకు పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను ఆయన ప్రశంసించారు. తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికలపై సమావేశంలో చర్చించలేదని ఆయన చెప్పారు. హైదరాబాద్ అల్లర్లపై కొందరు కాంగ్రెసు నాయకులు కుట్ర ఉందంటూ చేసిన ఆరోపణలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు అలాంటి బహిరంగ ప్రకటనలు చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. పిసిసి సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి కె. రోశయ్యతో పాటు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్, కెవిపి రామచందర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ కమిటీకి డి శ్రీనివాస్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications