ఇంటికి క్షేమంగా చేరిన ఇన్ఫోసిస్ లక్ష్మీప్రియ

సోమవారం ఉదయం జరిగిన సంఘటన వివరాలివి....అనుమానాస్పద పరిస్థితుల్లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని లక్ష్మీ ప్రియ అదృశ్యమైంది. ఆమె కిడ్నాప్ అయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కార్ఖానా పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కార్ఖానా ప్రాంతంలోని కాకాగూడ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ బేగంపేట్లోని ఓడఫోన్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు.
ఆయన భార్య లక్ష్మీప్రియ (35) ఇన్ఫోసిస్ కం పెనీలో క్వాలిటీ కంట్రోల్ మేనేజర్గా ఉద్యోగం చేస్తోంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ప్రతిరోజు లక్ష్మీప్రియ ఇంటి నుంచి నడుచుకుంటూ వచ్చి కార్ఖాన పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాప్లో బస్సు ఎక్కేది. సోమవారం ఎప్పటిలానే బస్టాప్కు వచ్చింది. అయితే బస్సు వెళ్లిపోవటంతో అక్కడే ఉన్న ఆటో ఎక్కింది. బస్సును ఛేజ్ చేయాలని చెప్పింది.
బస్సు జూబ్లీ బ స్టాండు నుంచి నేరుగా ప్యాట్నీ వైపు వెళ్లిపోగా, ఆటోడ్రైవర్ జూబ్లీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డులోకి ఆటోను మళ్లించాడు. అప్పటికే ఆటోలో ఇంకో వ్యక్తి ఉన్నట్లు తెలిసింది. ఆటోలో ఉన్న లక్ష్మీప్రియ తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ కలిగి ఉన్న పర్సును రోడ్డుపైకి విసిరింది. ఆ సమయంలో అటుగా కూకట్ పల్లి స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు వెళుతున్నారు. వారికి ఆ పర్సు దొరికింది.
కానిస్టేబుళ్లతోపాటు జూబ్లీ బస్టాండ్ వద్ద విధుల్లో ఉన్న మరో ఇద్దరు కానిస్టేబుళ్లు లక్ష్మీప్రియ పర్సును విసిరేయటం చూశారు. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు బ్యాగు తెరిచి చూడగా సెల్ ఫోన్ కనిపించింది. కాంటాక్ట్ లిస్టులో హోం అన్న నెంబర్ కు డయల్ చేయగా లక్ష్మీప్రియ భర్త లక్ష్మణ్ వారితో మాట్లాడాడు. లక్ష్మణ్ కు కానిస్టేబుళ్లు జరిగిన విషయం చెప్పి తాము కూకట్ పల్లి స్టేషన్ కు వెళుతున్నట్టు చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications