హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఓదార్పు యాత్ర సరైందే: మొయిలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
హైదరాబాద్: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్ర సమంజసమేనని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. పిసిసి సమన్వయ కమిటీ సమావేశానంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ నెల 9వ తేదీ నుంచి జగన్ ఓదార్పు యాత్ర చేయనున్న విషయం తెలిసిందే. మంత్రి వర్గ విస్తరణ పూర్తిగా ముఖ్యమంత్రి కె. రోశయ్యకు సంబంధించిన వ్యవహారమని మొయిలీ అన్నారు. శ్రీకృష్ణ కమిటీకి పార్టీ అధికారికంగా సమర్పించే నివేదిక ఇంకా సిద్ధం కాలేదని, తమ నివేదిక సమర్పణకు గడువు పెంచాలని శ్రీకృష్ణ కమిటీని కోరుతామని ఆయన చెప్పారు.

హైదరాబాద్ అల్లర్ల వెనక పార్టీలోని కొంత మంది హస్తం ఉందని పార్టీవారే విమర్శలు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ అలాంటి ప్రకటనలు చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పార్టీ నేతల క్రమశిక్షణ విషయాన్ని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పర్యవేక్షిస్తారని ఆయన చెప్పారు. రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X