జగన్ ఓదార్పు యాత్ర సరైందే: మొయిలీ
హైదరాబాద్ అల్లర్ల వెనక పార్టీలోని కొంత మంది హస్తం ఉందని పార్టీవారే విమర్శలు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ అలాంటి ప్రకటనలు చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పార్టీ నేతల క్రమశిక్షణ విషయాన్ని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పర్యవేక్షిస్తారని ఆయన చెప్పారు. రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.
వైయస్ జగన్ వీరప్ప మొయిలీ కాంగ్రెసు రోశయ్య శ్రీనివాస్ హైదరాబాద్ ys jagan veerappa moily congress rosaiah srinivas hyderabad
Story first published: Wednesday, April 7, 2010, 15:47 [IST]