నాది రాజకీయం కాదు: వైయస్ జగన్

పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో నిర్వహించనున్న ఓదార్పు కార్యక్రమం సహా వివిధ అంశాలపై రోశయ్యకు జగన్ వివరణలు ఇచ్చుకున్నారు. ఓదార్పు కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టినదీ చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి రోశయ్య ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని సమాచారం. ఈ పర్యటన రాష్ట్రంలో రాజకీయంగా ఎలాంటి ప్రభావం లేకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. తనకు తానుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించలేదని..అధిష్ఠానం ఆదేశాల మేరకే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించానని రోశయ్య స్పష్టం చేశారు. అధిష్ఠానం ఏ క్షణానైన్నా ముఖ్యమంత్రి సీటు నుంచి దిగిపోమ్మంటే ఆ క్షణమే దిగిపోతానని చెప్పారు.
తన ఓదార్పు కార్యక్రమానికి మందు పశ్చిమ గోదావరి జిల్లాలో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయడం కూడా చర్చకు వచ్చింది. శాంతి భద్రతల నేపథ్యంలోనే బదిలీలు జరిగినట్లు రోశయ్య వివరించారు. ఇలాంటి వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని రోశయ్య స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ అంశం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చింది. బుధవారం తాను ఢిల్లీకి వెళ్తున్నానని, అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకుంటానే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోనని రోశయ్య స్పష్టం చేశారు. మంత్రివర్గం గురించి ఇంకా ఆలోచించలేదని జగన్తో చెప్పారు.












Click it and Unblock the Notifications