హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎస్ తో ముగిసిన జగన్ భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్: మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి కె. రోశయ్యతో సమావేశమైన కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో భేటీ అయ్యారు. జగన్ వెంట దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అనుంగు మిత్రుడు కెవిపి రామచందర్ రావు కూడా ఉన్నారు. డిఎస్ తో జగన్ దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని జగన్ చెప్పినట్లు సమాచారం. ఓదార్పు యాత్రలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని డిఎస్ జగన్ కు సూచించినట్లు సమాచారం. కలిసి పనిచేయాలని డిఎస్, జగన్ ఒక అంగీకారానికి వచ్చినట్లు చెబుతున్నారు.

తాను ఈ నెల 9వ తేదీ నుంచి తలపెట్టిన ఓదార్పు యాత్రపై వైయస్ జగన్ డిఎస్ కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కె. రోశయ్యతో చెప్పిన విషయాలే జగన్ డిఎస్ తోనూ చెప్పినట్లు సమాచారం. తాను తలపెట్టిన ఓదార్పు యాత్ర పార్టీకి వ్యతిరేకం కాదని, తాను ఎవరికీ వ్యతిరేకం కాదని జగన్ డిఎస్ తో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డిఎస్, కెవిపి, జగన్ ఒకే వాహనంలో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడి పెళ్లికి బయలుదేరి వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X