కెసిఆర్ రక్తమాంసాల వ్యాపారి: లగడపాటి

నైజాంలో అప్పుడు 16 జిల్లాలున్నాయని, వాటిలో ప్రస్తుతం 5 జిల్లాలో మహారాష్ట్రలో, మూడు జిల్లాలు కర్నాటకలో ఉన్నాయని, మిగతా 8 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. భద్రాచలం నిజాం పాలనలో లేదని, దాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలుపుతారా అని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాలోని కొన్ని గ్రామాలు నిజాం పాలనలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ రకంగా 1956 పూర్వ స్థితిని కల్పించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ల్యాంకో ద్వారా తాను విద్యుదుత్పత్తి చేసి రాష్ట్రానికి మేలు చేస్తున్నానని చెబుతూ కెసిఆర్ ఒక్క మెగావాటైనా ఉత్పత్తి చేశారా అని ఆయన అడిగారు. విద్యార్థులకు తాను సేవలు చేశానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications