ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాన్న దారిలో నడుస్తున్నా: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఖమ్మం: తాను నాన్న వైయస్ రాజశేఖర రెడ్డి దారిలోనే నడుస్తున్నానని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అన్నారు. ఆయన బుధవారం ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓదార్పు యాత్ర నిర్వహించారు. వైయస్ ఆకస్మిక మృతికి తట్టుకోలేక మరణించినవారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఏడేళ్ల క్రితం నాన్న ఇదే దారిలో పాదయాత్ర చేశారని, తాను ఇదే దారిలో ఓదార్పు యాత్ర చేస్తున్నానని ఆయన అన్నారు. అందరూ తనను పెద్ద కొడుకులా చూసుకుంటున్నారని, అందుకే వారి బాధ్యతలను తాను తీసుకుంటున్నానని ఆయన అన్నారు.

తనకు ఖమ్మం జిల్లాలో ఇంత మంది ఆత్మబంధువులు ఉంటారని ఊహించలేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు చోట్ల వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. తెలంగాణపై జగన్ తన వైఖరి చెప్పాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. పాల్వంచలో వైయస్ విగ్రహావిష్కరణ తర్వాత ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా తెలంగాణవాదులు తెలంగాణపై జగన్ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని పట్టుబట్టారు. తెలంగాణ అనుకూల నినాదాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X