హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ప్రజాపథం కోసం డిమాండ్

By Santaram
|
Google Oneindia TeluguNews

Kadiyam Srihari
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో ప్రజాపథం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజాపథంగా మార్చాలని తెలుగుదేశం నేత కడియం శ్రీహరి డిమాండ్‌ చేశారు. ప్రజాపథం కార్యక్రమాన్ని బహిష్కరించాలన్న తెరాస అధినేత చంద్రశేఖరరావు ఇచ్చిన పిలుపును ఆయన తప్పుబట్టారు. దీని వల్ల నష్టం తప్ప మేలు జరగదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని ప్రతిగ్రామంలో ప్రారంభమయ్యే ప్రజాపథంలో తెలంగాణపై తీర్మానం చేసిన అనంతరమే ఇతర కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు.

ఇలా ఉండగా ప్రజాపథాన్ని అడ్డుకోమని తెరాస అధినేత చంద్రశేఖరరావు పిలుపునివ్వడం తగదని రాష్ట్రకాంగ్రెస్‌ ఎంపీల ఫోరం కన్వీనర్‌, కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రజలసమస్యలను తెలుసుకునేందుకు ప్రజాపథాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. అయితే తెలంగాణంలో ప్రజాపథం ప్రారంభించేముందు తెలంగాణపై తీర్మానం చేయాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X