విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అరకులోయకు ఆర్టీసీ కొత్త ప్యాకేజిలు

By Santaram
|
Google Oneindia TeluguNews

APSRTC
విజయవాడ: ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ సరికొత్త పర్యాటక ప్యాకేజీలను సిద్ధంచేస్తోంది. రీజియన్‌ లో కొత్తగా వోల్వో, సూపర్‌ లగ్జరీ, పల్లె వెలుగు బస్సులను ప్రవేశపెట్టనున్నారు. పాత బస్సుల స్థానంలో కొత్తవాటిని నడపనున్నారు. దీంతో రీజియన్‌కు మంచి రోజులు రానున్నాయని అధికారులు భావిస్తున్నారు.

వేసవిలో అరకువ్యాలీని సందర్శించేందుకు వీలుగా ఆర్టీసీ కొత్త ప్యాకేజీలను రూపొందిస్తోంది. పర్యటన రెండు మూడు రోజుల పాటు సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నం తీసుకువెళతారు. అక్కడ కైలాసగిరి, భీమిలి, రామకృష్ణా బీచ్‌ చూపించిన తర్వాత కిరండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో అరకులోయ తీసుకువెళతారు. ఆ రాత్రి అరకులో ఉంచుతారు. తిరుగు ప్రయాణంలో బొర్రా గుహలు చూపిస్తారు. ప్రయాణికులకు భోజన వసతి, డార్మెటరీ సదుపాయాన్ని కూడా కల్పిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X