హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజనపై నావి రెండు వైఖరులు: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: రాష్ట్రంలో ఏ ప్రాంత ప్రజల మనోభావాలకూ తమ పార్టీ వ్యతిరేకం కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడి, తెలుగుజాతిని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలని, అన్ని వర్గాలవారికి సామాజిక న్యాయం కల్పించాలన్న ఉదాత్త లక్ష్యాలతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని నెలకొల్పారని, ఆ ఆశయాల సాధనకే ఇప్పటికీ తమ పార్టీ కట్టుబడి పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. మెదక్ జిల్లా టీఆర్ఎస్ నేత నవాజ్ రెడ్డి తన అనుచరులతో కలిసి సోమవారం సాయంత్రం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి బాబు మాట్లాడారు.

రాష్ట్రంలో తెలంగాణ, సమైక్యవాద ఉద్యమాలు వచ్చాయని, అందుకే ఇరు ప్రాంతాల నాయకులకు స్వేచ్ఛనిచ్చానని, దానివల్లనే శ్రీకృష్ణ కమిటీకి ఇరు ప్రాంతాల నాయకులు తమ తమ ప్రజల అభిప్రాయాల మేరకు నివేదికలిచ్చారని ఆయన అన్నారు. రెండు ప్రాంతాలు నాకు రెండు కళ్లు అని, ఈ రెండు ప్రాంతాలవారు ఆదరించడం వల్లే తొమ్మిదేళ్లపాటు సీఎంగా ఉండగలిగానని, ఏ ప్రాంతం వారి మనోభావాలకు అనుగుణంగా అక్కడి నాయకులు పని చేయడానికి స్వేచ్ఛనిచ్చానని, ఆయా ప్రాంతాల ప్రజల వాణి ప్రకారం వెళ్లాలని నాయకులకు చెప్పానని, పార్టీగా ఏ వైఖరీ మేం తీసుకోలేదని ఆయన వివరించారు. ముఖ్యమైన ప్రజా సమస్యలను ప్రస్తావించే వీలు లేకుండా ప్రజాపథాన్ని ప్రభుత్వం ఒక తంతులా మార్చిందని విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X