గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నక్సల్స్ ప్రాంతాల్లో ఉపాధి కల్పన: సబిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
గుంటూరు: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పించే చర్యలను పెద్ద యెత్తున చేపడతామని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. గుంటూరు జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమాన్నిఆమె మంగళవారం ప్రారంభించారు. యువత పెడదారి పట్టకుండా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. నక్సల్స్ అణచివేతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిందని ఆమె అన్నారు. గుంటూరుకు పోలీసు కమిషనరేట్ హోదా కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

రోజుకు 24 గంటలు పనిచేసేది పోలీసు శాఖ ఒక్కటేనని ఆమె అన్నారు. రాష్ట్రంలో నక్సలైట్ల అణచివేతకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఎంతో కృషి చేశారని ఆమె అన్నారు. రోజుకు ఒక్కసారైనా రాష్ట్ర ప్రజలు వైయస్ రాజశేఖర రెడ్డిని తలుచుకుంటారని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X