నాపై విచారణ జరిపించండి: థరూర్

ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ఉద్దేశం తనకు లేదని ఆయన చెప్పారు. సంబంధిత అంశాలపై లోతుగా విచారణ జరపడానికి తన రాజీనామా ప్రధానికి, తన మంత్రివర్గ సహచరులకు ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. భారత రాజకీయాలకు తాను కొత్తవాడినని, అయితే చాలా కాలంగా ప్రజాసేవలో ఉన్నానని, ఇంత వరకు తనపై ఏ విధమైన ఆరోపణలు లేవని ఆయన అన్నారు. తాను సుదీర్ఘమైన అంతర్జాతీయ కెరీర్ తర్వాత భారత్ వచ్చానని, కేరళకు ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వంగా ఉందని ఆయన అన్నారు.
ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో ప్రభుత్వంలో, పార్టీలో పనిచేయడం తనకు గర్వకారణమని ఆయన చెప్పారు. శశి థరూర్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలిశారు.












Click it and Unblock the Notifications