వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపియల్ ఫైనల్ తర్వాత మోడీ రాజీనామా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Lalit Modi
న్యూఢిల్లీ: ఐపియల్ ట్వంటీ20 ఫైనల్ మ్యాచ్ తర్వాత ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు బిసిసిఐ వర్గాలంటున్నాయి. లలిత్ మోడీ వ్యవహార శైలి పట్ల, ప్రస్తుత వివాదం పట్ల బోర్డు సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ తో మంతనాలు జరపడానికి ప్రస్తుత అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఢిల్లీకి వచ్చారు.

మోడీని ఐపియల్ కమిషనర్ పదవి నుంచి తొలగించాలని శశాంక్ మనోహర్ భావిస్తున్నారు. దీంతో ఆయన శరద్ పవార్ తోనూ, బోర్డు సభ్యులతోనూ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ లలిత్ మోడీని బలపరుస్తున్న నేపథ్యంలో శశాంక్ మనోహర్ శరద్ పవార్ తో భేటీ అవుతుండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బిసిసిఐ వర్కింగ్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 26వ తేదీన జరుగుతోంది. అలాగే వర్కింగ్ కమిటీ సమావేశం వచ్చే నెల 2వ తేదీన జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X