వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ర్యాలీలో స్పృహ తప్పిన గడ్కరీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Nitin Gadkari
న్యూఢిల్లీ: అధిక ధరలకు నిరసనగా న్యూఢిల్లీలో బుధవారం భారీగా చేపట్టిన ర్యాలీలో బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ స్పృహ తప్పి పడిపోయారు. ర్యాలీనుద్దేశించి ప్రసంగించిన తర్వాత ఆయన స్పృప తప్పి పడిపోయారు. కార్యకర్తలు ఆయనకు నీరు అందించారు. అధిక ధరలకు నిరసనగా బిజెపి బుధవారం రాం లీలా మైదానం నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహించింది. లక్షలాది మంది బిజెపి కార్యకర్తలు ఢిల్లీలో కదం తొక్కారు. దీంతో ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

అధిక ధరలకు వ్యతిరేకంగా బిజెపి సభ్యులు పార్లమెంటు నుంచి వాకౌట్ చేసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బిజెపి నాయకులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, మురళీ మనోహర్ జోషి, అద్వానీ, ఎం వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు వంద నుంచి 200 శాతం పెరిగాయని అద్వానీ విమర్శించారు. నిర్వహణ లోపం వల్ల, అవినీతి వల్ల ధరలు పెరిగాయని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X