తెలంగాణలోనూ సమైక్యవాదులు: చిరు

Chiranjeevi
హైదరాబాద్‌: తెలంగాణలో అధిక శాతం సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే తమ అంతిమ లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇప్పటి వరకూ సాధించిన ఫలితాలనే నిదర్శనంగా చూపవచ్చునని ఆయన అన్నారు. ప్రజలు నిజంగా తెలంగాణ రాష్ట్రం కావాలను కుంటే తెరాసను ఏకపక్షంగా గెలిపించేవారని చిరంజీవి అన్నారు. తెరాసను తెలంగాణ ప్రాంత ప్రజలు ఆదరించకపోవడం వల్లనే ఆ పార్టీ సమైక్యాంధ్రకు మద్ధతునిచ్చే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నదని వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు టివి చానెల్‌ ఇంటర్వూలో మాట్లాడిన చిరంజీవి రాష్ట్రం కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. సమ్యైక్యంగా ఉండటం వల్లనే తెలంగాణలో ఇంత అభివృద్ధి జరిగిందని, విడిపోతే అభివృద్ధి కనిపిం చదని చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు చాలా ఉన్నాయని అందరూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేపడితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించాలన్నారు.

ప్రజలు ఎప్పూడూ నిర్దిష్టమైన ఆలోచనలతోనే ఉంటారని, ఈ విషయంలో రాజకీయ పార్టీలు, నాయకత్వాలే తప్పటడుగులు వేస్తుం టాయని తెలిపారు. పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులను నిర్మించేటప్పుడు ముంపుప్రాంతాలుం డటం సహజమని అన్నారు. పోలవరం ప్రాజెక్టును కోల్డ్‌ స్టోరేజీలో పడేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీరి ప్రయత్నాలు ఇక సాగవని చిరంజీవి అన్నారు. రాష్ట్ర ప్రజలు తనను అన్ని విధాలా ఆదరిస్తున్నారని, ఎన్నికల ఫలితాలలో ఈవిఎంలపై అనుమానంగా ఉందన్నారు. రాజకీయాలలోకి ఎందుకు వచ్చానా అని ఎప్పడూ ఇబ్బంది పడిన సందర్భాలు లేవని, సినిమాలలో మరో ఐదారేళ్ళు మాత్రమే ఉంటానని, ప్రజాసేవకు రిటైర్మెంటు ఉండదని అన్నారు. ప్రస్తుతం సినిమాలపై దృష్టి లేదని, ఆ పని రామ్‌ చరణ్‌కు అప్పగించానని చెప్పారు. సమయముంటే సినిమాల గురించి అలోచిస్తానని తన మనసులోని మాటను చిరంజీవి బయటపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+