హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి ఆంధ్రా పార్టీ అవుతుంది: అసద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తుడిచిపెట్టుకు పోతుందని, ఆ పార్టీ ఆంధ్రా పార్టీగానే మిగిలిపోతుందని మజ్లీస్ నేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. శ్రీకృష్ణ కమిటీతో భేటీ అనంతరం ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయవద్దని తాము కోరినట్లు ఆయన తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే హైదరాబాదు అరాచక శక్తుల అడ్డాగా మారుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన చేయాల్సి వస్తే తెలంగాణతో రాయలసీమను కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాజకీయంగా బిజెపి బలపడుతుందని, దాని వల్ల హైదరాబాదులో మతఘర్షణలు పెరుగుతాయని ఆయన అన్నారు. సెటిలర్లు అనే పదం వాడకాన్ని నిషేధించాలని, ఆ పదాన్ని వాడితే కేసులు పెట్టేలా చట్టాన్ని తేవాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనుకుంటే తెలంగాణకు రాజ్యాంగ బద్దమైన హామీలను ఇచ్చి అమలు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని విభజించకూడదనే వాదనకే తమ ప్రాధాన్యమని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X