వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోలతో పోలీసుల ఎదురుకాల్పులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సోమవారం ఎదురు కాల్పులు జరిగాయి. జిల్లాలోని జికె విధీ మండలం ఆర్వీ నగరం అటవీ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు సంభవించాయి. ఈ ఎదురుకాల్పుల్లో కొంత మంది పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. ఆర్వీ నగర్ లో సోమవారం సంత జరుగుతోంది.

తొలుత పోలీసు జీపును మావోయిస్టులు పేల్చి వేశారు. దీంతో పోలీసులు నక్సలైట్ల మీదికి కాల్పులు ప్రారంభించారు. ఈ భీకర కాల్పులతో సంతలోని ప్రజలకు పరుగులు తీశారు. ఈ సంఘటనతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలను సంఘటనా స్థలానికి పంపిస్తున్నారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో తరుచుగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X