వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిట్ ముందు హాజరైన ప్రవీణ్ తొగాడియా

By Pratap
|
Google Oneindia TeluguNews

Praveen Togadia
గాంధీనగర్: 2002 అల్లర్ల కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు విశ్వహిందూ పరిషత్ (విహెచ్ పీ) అంతర్యాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా సోమవారం హాజరయ్యారు. పాత సచివాలయంలోని 11 నెంబర్ బ్లాక్ లో గల సిట్ కార్యాలయానికి తొగాడియా ఉదయం 11 గంటలకు వచ్చారు. ఆయన వెంట జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ విహెచ్ పీ కార్యకర్తలు వచ్చారు. తొగాడియా కార్యాలయంలోకి వెళ్లిన తర్వాత కార్యకర్తలు, సాధువులు ఆవరణలో కూర్చుని భజనలు చేశారు.

సిట్ కార్యాలయానికి రావడానికి ముందు తొగాడియా అహ్మదాబాదులోని మహాలక్ష్మీ దేవాలయాన్ని, గాంధీనగర్ లోని పంచదేవ్ ఆలయాన్ని సందర్శించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు ఎషాన్ జాఫ్రీ హత్యకు సంబంధించిన సంఘటనలో ఆయన భార్య జాకియా జాఫ్రీ చేసిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 19వ తేదీన తమ ముందు హాజరు కావాలని తొగాడియాకు సిట్ సమన్లు జారీ చేసింది. ఆయితే ఆయన ఆ రోజు హాజరు కాలేదు.

ఫిర్యాదు ప్రతి అందకపోవడం వల్లనే తాను ఆ రోజు రాలేకపోయానని తొగాడియా సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను పదే పదే అడిగినా ఆ ప్రతిని తనకు ఇవ్వలేదని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టుపై ఉన్న గౌరవంతో తాను సిట్ ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దేశంలో తాను హిందువును కావడమే నేరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X