హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే: తెలంగాణ టిడిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం తప్ప మార్గాంతరం లేదని తెలుగుదేశం తెలంగాణ నాయకులు శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు తెలుగుదేశం తెలంగాణ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, విజయరామారావు, కడియం శ్రీహరి తదితరులు తమ వాదనలు వినిపించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణకు అన్యాయమే జరుగుతోందని, ఉద్యోగాల్లో, సాగునీటిలో నిరంతరాయంగా అన్యాయం కొనసాగుతోందని తాము శ్రీకృష్ణ కమిటీకి తెలిపినట్లు నాగం జనార్దన్ రెడ్డి మీడియా ప్రతినిధులకు చెప్పారు. తెలంగాణకు ఇచ్చిన గ్యారంటీలేవీ అమలు కావడం లేదని, అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమకు న్యాయం జరుగుతుందని చెప్పినట్లు ఆయన తెలిపారు.

అష్ట సూత్ర పథకం, ఆరు సూత్రాల పథకం వంటివేవీ అమలు కాలేదని, తెలంగాణకు రాజ్యాంగ బద్దంగా కల్పించిన గ్యారంటీలు కూడా అమలుకు నోచుకులేదని, అందువల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాల్సిందేనని తాము శ్రీకృష్ణ కమిటీకి చెప్పినట్లు విజయరామారావు చెప్పారు. ఆర్టికల్ 3 కింద కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించడం ద్వారా చాలా సులభంగా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చునని, అందువల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పెద్ద కష్టమేమీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభమైందని డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి పోయిందని తాము ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X