వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ మన్యంలో మావోల విధ్వంసం

By Pratap
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గిరిజన ప్రాంతంలో మావోయిస్టుల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉన్నది. తాజాగా చింతపల్లి మండలం అన్నవరం పోలీసుస్టేషన్‌ పరిధిలో కుడుముసారి వద్ద పొక్లెయిన్‌ కు నక్సల్స్‌ నిప్పుపెట్టారు. ఓ ట్రాక్టర్‌ ను కూడా తగులబెట్టినట్లు తెలుస్తోంది. జికె వీధి మండలం రొంపుల రహదారిపై చెట్లు నరికి అడ్డంగా వేశారు. దీంతో ఆ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి.

ఇటీవలి కాలంలో విశాఖ మన్యంలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా ఉండే కాంగ్రెస్‌ పార్టీ నాయకులను అంతమొందిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మావోయిస్టుల వరుస విధ్వంసాలతో ఆ ప్రాంతంలో భయాందోళనలు చోటు చేసుకున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X