వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
టెక్సాస్: అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మరణించాడు. రాష్ట్రానికి చెందిన నరేశ్ నాయుడు (24) అనే విద్యార్థి టెక్సాస్‌ లో మరణించారు. గత సోమవారం టెక్సాస్‌ లోని కార్పస్ క్రిస్టే సమీపంలో స్నేహితులతో కలిసి నరేశ్ కారులో వెళుతుండగా, వాహనం అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేశ్ తీవ్రంగా గాయపడ్డారు. ముందు వరసలో కూర్చున్న ఆయన స్నేహితులు నవీన్, ప్రద్యుమ్న స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నరేశ్ తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆయన మరణించారు.

నరేశ్ తల్లిదండ్రులు, సోదరుడు ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారు. ఇండియానా యూనివర్సిటీలో చదువుతున్న నరేశ్ ఈ నెల తొమ్మిదో తేదీన ఎంబీఏ పూర్తి చేశారు. ప్రమాద సమయంలో కారును ప్రద్యుమ్న డ్రైవ్ చేస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. నరేశ్ మృతదేహాన్ని భారత్‌ కు తరలించేందుకు తానా నిర్వాహకులు దౌత్యాధికారులతో మాట్లాడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X