జగన్ ఇష్యూ: మీడియాపై విహెచ్ గుర్రు

సంక్షేమ పథకాల అమలు తీరును చూసి తలవంచుకోవాల్సి వస్తోందన్న జగన్ వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు "తలవంచుకోవాలా? వద్దా? అనే దానికి ప్రతి ఒక్కరికీ సొంత కొలమానాలు ఉంటాయ" అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో అదే పనిగా కోత పెడుతోందన్న విమర్శలను తోసిపుచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉందని, వైఎస్ ఉన్నా ఇదే పని చేసే వారని అభిప్రాయపడ్డారు. రోశయ్య ప్రభుత్వ పనితీరు గురించి కాంగ్రెస్ ఎంపీకి చెందిన ఓ పత్రిక వ్యతిరేక వార్తలు రాస్తున్న విషయం గురించి అడిగినప్పుడు "ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలను చదవొద్దని వైఎస్ ఇది వరకే చెప్పారు" అని గుర్తుచేశారు. అలాగని తాను పత్రికను చదవొద్దని చెప్పడంలేదని, వైఎస్ చేసిన వ్యాఖ్యలను మాత్రమే గుర్తుచేస్తున్నానన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి రెండు పథకాలు సరిగా అమలు కావడంలేదని తాను బహిరంగంగా వ్యాఖ్యానిస్తే సోనియా పిలిచి ఏదైనా ఉంటే తన వద్ద చెప్పాలి తప్పితే బహిరంగంగా కాదని సూచించారని అన్నారు.












Click it and Unblock the Notifications