వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మన ద్రాక్షకు యూరప్ లో చుక్కెదురు
దాదాపు 2,600 కంటైనర్లను తాము పంపించినట్లు ఎగుమతిదారులు చెబుతున్నారు. ఈ మొత్తం కంటైనర్లు ప్రస్తుతం యూరప్ నౌకాశ్రయంలోనే చిక్కుకున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి యూరప్కు ద్రాక్ష పళ్ల ఎగుమతి భారీ స్థాయిలో జరుగుతుంది. ద్రాక్ష పళ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకుగాను వీటిపై క్లోరోమాక్ వ్యాట్ రసాయనాన్ని చల్లుతారు.
ఇది యూరోపియన్ దేశాలు నిషేధించిన రసాయనాల్లో ఒకటి. అయి నా రైతులు దీనిని వినియోగించడం వల్ల తాజాగా ఎగుమతి చేసిన ద్రాక్ష పళ్ల కన్ సైన్ మెంట్ ను యూరోపియన్ అధికారులు దేశంలోకి తీసుకోవడానికి నిరాకరించారు. దీని పర్యవసానంగా నష్టపోయిన ఎగుమతిదారులను త్వరలోనే ఆదుకుంటామని వాణిజ్యశాఖ కార్యదర్శి రాహుల్ ఖుల్లర్ తెలిపారు. అయితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోనుందో రాహుల్ వెల్లడించలేదు.
Comments
Story first published: Sunday, May 16, 2010, 15:42 [IST]