హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుపానుగా మారిన వాయుగుండం

By Pratap
|
Google Oneindia TeluguNews

Bay Of Bengal
హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం తుపానుగా మారింది. దీని ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ తుపానుకు లైలాగా నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ తుపాను బంగాళాఖాతంలో విశాఖపట్నానికి 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి తీర ప్రాంతంలో గంటకు 70 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. అన్ని ఓడరేవుల్లో రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు జాలర్లను హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని లోతట్టు ప్రాంత ప్రజలకు సూచించారు.

తుపాను ఆంధ్ర ప్రాంతంలోని తీర ప్రాంతాన్ని కొద్ది గంటల్లో తాకే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను హెచ్చరికలపై ముఖ్యమంత్రి కె. రోశయ్య మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని తీర ప్రాంత జిల్లాల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X