హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పకపోతే గ్రేటర్ రాయలసీమ: మైసురా రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

United Andhra
హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని రాయలసీమ అభ్యుదయ సమితి ప్రతినిధి, తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు మైసురా రెడ్డి శ్రీకృష్ణ కమిటీకి విన్నవించారు. రాయలసీమ అభ్యుదయ సమితి తరఫున ఆయన మంగళవారం శ్రీకృష్ణ కమిటీ ముందు తన వాదనలు వినిపించారు. వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినే అని, అయితే రాష్ట్ర విభజన అనివార్యమైతే గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని సూచించానని ఆయన శ్రీకృష్ణ కమిటీతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

విభజన సమస్యకు రాజకీయ పరిష్కారం సూచించాలని తాను కమిటీని కోరినట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులోనే కాకుండా తెలంగాణలో కూడా అభివృద్ధి జరిగిన విషయాన్ని తాను కమిటీకి వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని విభజిస్తే జాతీయ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆయన అన్నారు. గతంలో తాము ఇచ్చిన నివేదికపై శ్రీకృష్ణ కమిటీకి వివరణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X