హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ తో ఆనాడే విభేదించా: జెసి

By Pratap
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: రెండు సంక్షేమ పథకాల విషయంలో తాను ఆనాడే దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డితో విభేదించినట్లు కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్తు, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాల విషయంలో తాను రాజశేఖర రెడ్డితో ఆనాడే విభేదించినట్లు ఆయన తెలిపారు. వైయస్ పథకాలను సమీక్షించాలంటే పథకాలన్నింటినీ తీసేయాలని కాదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాల ఫలితాలు అందాలని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

సంక్షేమ పథకాలను యధాతథంగా కనసాగించాలా, కొంత మార్పు చేయాలా, లోపాలను సరిద్దిద్దాలా, పథకాల సైజును తగ్గించాలా అనే విషయాలపై ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆయన అన్నారు. బెంజ్ కారులో తిరిగే వారికి కూడా సంక్షేమ పథకాలను అందించడం సరైంది కాదని ఆయన అన్నారు. ఉన్న పథకాలనే జాగ్రత్తగా అమలు చేయాలని, అందుకు సమీక్ష అవసరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X