వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandra Babu Naidu
ఒంగోలు: తుఫాను కారణంగా సంభవించిన పంటనష్టాన్ని అంచనా వేయటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రకాశం జిల్లాలో తుఫాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు, బాధితులను పరామర్శించేందుకు ఆయన శనివారం వచ్చారు. ఉలవపాడులో మామిడితోటలను ఆయన పరిశీలించి రైతులను పరామర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇబ్బందిపడుతున్న రైతులకు ఈ తుఫాను తోడై తీవ్ర నష్టాలు మిగిల్చిందని ఆయన అన్నారు.

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సర్వం నష్టంపోయిన జాలర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. వారికి నెల బియ్యంతో పాటు ఆర్థిక సాయం కూడా అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం ముందుగానే పొగాకు కొనుగోలు చేసి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

అంతకు ముందు ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశనాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ పటిష్టత, అభివృద్దిపై ఆయన చర్చించారు. అనంతరం 'లైలా' తుపాను తాకిడికి అల్లకల్లోలమైన ప్రకాశంజిల్లాను సందర్శించేందుకు బయలుదేరి వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X