హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజలకు, మాకు నాన్నగారి ఆశీస్సులుంటాయి: బాలకృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: నాన్నగారు మన ముందు లేకున్నా ఆయన ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు, కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 88వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి, పార్లమెంటు సభ్యుడు హరికృష్ణ, సినీ నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, జయకృష్ణ తదితరులు ఎన్టీఆర్ కు అంజలి ఘటించారు.

తెలుగువారంతా బాగుండాలని ఎన్టీఆర్ ఎల్లప్పుడూ పరితపించేవారని హరికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తి అని, ఎన్టీఆర్ ఆశీస్సులు, చల్లని చూపు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ ను ప్రజలు ఇప్పటికీ ఆరాధిస్తున్నారని, ఎన్టీఆర్ ఖ్యాతి అజరామరమని, ఎన్టీఆర్ చిరంజీవి అని కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. కుటుంబ సభ్యులందరం కలవడం తన జీవితంలో మరువలేనిదని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X