వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాడిలో గాయపడిన ఎమ్మెల్యేలు కొండా సురేఖ, కవిత

By Pratap
|
Google Oneindia TeluguNews

konda Surekha
వరంగల్: వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘర్షణలో శుక్రవారం కాంగ్రెసు మహిళా శాసనసభ్యులు కొండా సురేఖ, కవిత గాయపడ్డారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు స్వాగతం చెప్పడానికి రైల్వే స్టేషనుకు వచ్చిన కాంగ్రెసు నాయకులపైకి తెలంగాణ ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో సురేఖ, కవిత గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. రైల్వే స్టేషనులో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.

మహబూబాబాద్ స్టేషనులో ఆందోళనకారులు కేరళ ఎక్స్ ప్రెసును ఆపేశారు. స్టేషనులో నెలకొన్న వాతావరణంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. స్టేషనలో ఓ యువకుడు స్పృహ తప్పి పోయాడు. జగన్ యాత్రను నిరసిస్తూ నాగరాజు అనే యువకుడు జనగామలో గొంతు కోసుకున్నాడు. రైల్వే స్టేషనులో విధ్వంస వాతావరణం నెలకొని ఉంది. గాయపడినవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మీడియా వాహనాలపై కూడా ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X