వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పై తగిన సమయంలో సరైన చర్య: ప్రణబ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukarjee
గుల్బర్గా: మాట వినకుండా ఓదార్పు యాత్ర చేపట్టిన కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పార్టీ సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటుందని కాంగ్రెసు సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. గుల్బర్గాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన జగన్ వ్యవహారంపై అడిగిన ప్రశ్నలకు శనివారం సమాధానమిచ్చారు. అవసరమైతే జగన్ పై పార్టీ సరైన సమయంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

ఓదార్పు యాత్ర చేపట్టవద్దని పార్టీ జగన్ కు స్పష్టంగా చెప్పిందని, అయినా జగన్ వినలేదని, కాంగ్రెసు కార్యకర్తగా పార్టీ సూచనను జగన్ శిరసా వహించాల్సి ఉందని ఆయన అన్నారు. ఇప్పటికైనా జగన్ తన ఓదార్పు యాత్రను విరమించుకోవాలని ఆయన సూచించారు. శుక్రవారం జరిగిన పార్టీ కోర్ కమిటీలో జగన్ తీరుపై చర్చించినట్లు తెలిసింది. ఆ చర్చల సారాంశం మేరకే ప్రణబ్ ముఖర్జీ జగన్ పై మీడియా ముందు మాట్లాడినట్లు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X