వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ కే ప్రజల్లో ఫేస్ వాల్యూ ఉంది: లక్ష్మీపార్వతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Laxmi Parvathi
హైదరాబాద్‌ : కాంగ్రెసులో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు మాత్రమే ప్రజల్లో ఫేస్ వాల్యూ ఉందని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి అన్నారు. ఆమె శనివారం ఉదయం వైయస్ జగన్ ను కలిశారు. జగన్ కు కాంగ్రెసు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె జగన్ తో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ విషయంలో రాష్ట్ర కాంగ్రెసు డైలమాలో ఉందని ఆమె అన్నారు. భవిష్యత్తులో ప్రజలే జగన్ ను ముందుకు నడిపిస్తారని ఆమె అన్నారు.

వరంగల్ జిల్లా మహబూబాబాద్ సంఘటనలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కె. చంద్రశేఖర రావు, హరీష్ రావు బాధ్యత వహించాలని ఆమె అన్నారు. వారిద్దరిని అరెస్టు చేసి వారిపై కేసులు పెట్టాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెసిఆర్ కు తాము తగిన బుద్ధి చెప్తామని ఆమె హచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X