వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ కుటుంబాన్ని పావుగా వాడుకోవద్దు: హరికృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Harikrishna
హైదరాబాదు: స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులను పావులుగా వాడుకోవద్దని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ సూచించారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆయన శుక్రవారం ప్రసంగించారు. తాము నందమూరి వంశంలో పుట్టినవాళ్లమని, పార్టీ కోసం ప్రాణాలిస్తామని, తమను పావులుగా మాత్రం వాడుకోవద్దని ఆయన అన్నారు. సోదరి పురంధేశ్వరి పిలిచింది కాబట్టే బాలయ్య, ఇతర కుటుంబ సభ్యులం కారంచేడులోని ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారమని ఆయన వివరణ ఇచ్చారు. అది మా సొంత కార్యక్రమమని, అంతేతప్ప కాంగ్రెస్‌ మోచేతి నీళ్లు తాగాల్సిన గతి, గత్యంతరం తమకు లేదని ఆయన అన్నారు.

అన్నఎన్టీఆర్‌ ఆనాడు యువతకు అందించిన స్ఫూర్తి ఏది? పార్టీలో యువత నిద్రపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ఆయన అడిగారు. ఈ బానిస బతుకులు పోవాలంటే తెదేపాను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని, పార్టీ జెండా గగనతలంలో ఎగరాలని, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసి మనం పండగ చేసుకోవాలని సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X