వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kurnool
కర్నూలు: కర్నూలు జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును లారీ ఢీకొట్టడంతో కర్నూలు జిల్లాలోని పాములపాడు మండలం కిష్టారావు పేట గ్రామ సమీపంలో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సభవించింది. మృతుల్లో ఓ పాప కూడా ఉంది. మృతులు ఆత్మకూరు ప్రాంతానికి చెందినవారని భావిస్తున్నారు.

ప్రమాదంలో గాయపడిన పది మందిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. లారీ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. నందికొట్కూరు నుంచి ఆత్మకూరు వెళ్తున్న ఆర్టీసి బస్సును లారీ ఢీకొట్టింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X