చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం రోశయ్యకు భరోసా: వైయస్ జగన్ కు హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
చిత్తూరు: కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర నాయకులకు, ప్రజలకు స్పష్టమైన సంకేతాలను అందిస్తోంది. ముఖ్యమంత్రి కె. రోశయ్యకు అన్ని విధాలుగా ఉంటామని, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెనక్కి తగ్గాల్సిందేనని కాంగ్రెసు అధిష్టానం స్పష్టం చేస్తోంది. చిత్తూరు జిల్లా కలికిరిలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి పి. చిబందరం బుధవారం సాయంత్రం చేసిన ప్రసంగం ఆ విషయాన్ని రుజువు చేస్తోంది. రాయలసీమ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కె. రోశయ్య నాయత్వాన్ని బలపరచాలని ఆయన పిలుపునివ్వడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ముఖ్యమంత్రి కె. రోశయ్యకు కేంద్రం అండగా నిలుస్తుందని కూడా ఆయన చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసిస్తూనే రోశయ్య నాయకత్వాన్ని ఆయన సమర్థించారు. దానికి తోడు, రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు. అలా చెప్పడం ద్వారా సంక్షేమ పథకాలకు రోశయ్య ప్రభుత్వం కోత పెడుతోందనే కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విమర్శను తోసిపుచ్చారు. ఈ బహిరంగ సభలో వైయస్ కు అత్యంత సన్నిహితుడైన వ్యవసాయ శాఖ మంత్రి చిదంబరం ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. వైయస్ అనుచరులను వైయస్ జగన్ కు దూరమే చేసే ఎత్తుగడగా కూడా దీన్ని పరిగణించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X