సిఎం రోశయ్యకు భరోసా: వైయస్ జగన్ కు హెచ్చరిక
ముఖ్యమంత్రి కె. రోశయ్యకు కేంద్రం అండగా నిలుస్తుందని కూడా ఆయన చెప్పారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసిస్తూనే రోశయ్య నాయకత్వాన్ని ఆయన సమర్థించారు. దానికి తోడు, రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు. అలా చెప్పడం ద్వారా సంక్షేమ పథకాలకు రోశయ్య ప్రభుత్వం కోత పెడుతోందనే కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విమర్శను తోసిపుచ్చారు. ఈ బహిరంగ సభలో వైయస్ కు అత్యంత సన్నిహితుడైన వ్యవసాయ శాఖ మంత్రి చిదంబరం ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. వైయస్ అనుచరులను వైయస్ జగన్ కు దూరమే చేసే ఎత్తుగడగా కూడా దీన్ని పరిగణించవచ్చు.
Comments
చిదంబరం రోశయ్య వైయస్ జగన్ రఘువీరా రెడ్డి కాంగ్రెసు చిత్తూరు chidambaram rosaiah ys jagan raghuveera reddy congress chittoor
Story first published: Thursday, June 3, 2010, 8:56 [IST]